Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023 నాటికి తెరుచుకోనున్న అయోధ్య రామాలయం తలుపులు

Webdunia
శనివారం, 17 జులై 2021 (15:09 IST)
దేశంలోని రామభక్తులందరూ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం తలుపులు 2023 నాటికి తెరుచుకోనున్నాయి. ఏడాది చివరినాటికి భక్తులకు శ్రీరామదర్శనం కల్పించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. 15మంది సభ్యలున్న ఈ ట్రస్టు రెండురోజులపాటు సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ మాజీ సలహాదారు, ట్రస్ట్ చీఫ్ నృపేంద్రమిశ్రా అధ్యక్షత వహించారు. 
 
ఆలయ నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులతోపాటు గర్భగుడిలో మూలమూర్తి ప్రతిష్ఠాపన, భక్తులకు దర్శనభాగ్యం కల్పించే విషయాన్ని ట్రస్టు కూలంకషంగా చర్చించింది. సమావేశం వివరాలను ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ అయోధ్యలో విలేకరులకు వివరించారు.
 
'గత రెండు రోజులుగా జరిగిన సమావేశంలో 2023 చివరినాటికల్లా భక్తులకు 'భగవాన్' దర్శనం కల్పించే విషయమై చర్చించాం. . గర్భగుడి నిర్మాణం, మూలమూర్తి ప్రతిష్ఠాపన అంశాలనూ చర్చించాం. మొత్తం నిర్మాణం పర్యావరణ అనుకూలమైన విధంగా జరుగుతోంది. 2025నాటికి మొత్తం 70 ఎకరాలను పూర్తిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం ' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments