2023 నాటికి తెరుచుకోనున్న అయోధ్య రామాలయం తలుపులు

Webdunia
శనివారం, 17 జులై 2021 (15:09 IST)
దేశంలోని రామభక్తులందరూ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం తలుపులు 2023 నాటికి తెరుచుకోనున్నాయి. ఏడాది చివరినాటికి భక్తులకు శ్రీరామదర్శనం కల్పించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. 15మంది సభ్యలున్న ఈ ట్రస్టు రెండురోజులపాటు సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ మాజీ సలహాదారు, ట్రస్ట్ చీఫ్ నృపేంద్రమిశ్రా అధ్యక్షత వహించారు. 
 
ఆలయ నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులతోపాటు గర్భగుడిలో మూలమూర్తి ప్రతిష్ఠాపన, భక్తులకు దర్శనభాగ్యం కల్పించే విషయాన్ని ట్రస్టు కూలంకషంగా చర్చించింది. సమావేశం వివరాలను ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ అయోధ్యలో విలేకరులకు వివరించారు.
 
'గత రెండు రోజులుగా జరిగిన సమావేశంలో 2023 చివరినాటికల్లా భక్తులకు 'భగవాన్' దర్శనం కల్పించే విషయమై చర్చించాం. . గర్భగుడి నిర్మాణం, మూలమూర్తి ప్రతిష్ఠాపన అంశాలనూ చర్చించాం. మొత్తం నిర్మాణం పర్యావరణ అనుకూలమైన విధంగా జరుగుతోంది. 2025నాటికి మొత్తం 70 ఎకరాలను పూర్తిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం ' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments