Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిపై ఇంకా నూకలు మిగిలివున్నాయంటే.. ఇదేరా (Video)

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (09:00 IST)
ఈ భూమిపై నీకు ఇంకా నూకలు మిగిలివున్నాయ్.. అందుకే చావు నుంచి తప్పించుకున్నావ్ అని కొందరు అంటుంటారు. ఈ వ్యాఖ్యలు నిజమే. కొందరికి అదృష్టం అలా ఉంటుంది. తాజాగా ఓ యువకుడు రెండు బస్సుల మధ్య చిక్కుకున్నప్పటికీ చిన్నపాటి గాయం కూడా లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో పాతది అయినప్పటికీ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. 
 
ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ యువకుడు రోడ్డును క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఒక బస్సు వెళుతుండటంతో రోడ్డుపై కాస్త మధ్యలో ఆగాడు. ఇంతలో వెనుక నుంచి తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు... ముందు వెళుతున్న బస్సును క్రాస్ చేసేందుకు అమిత వేగంతో దూసుకొచ్చింది. దీన్ని గమనించిన యువకుడు.. తప్పించుకునే ప్రయత్నంలో రెండు మధ్యలో చిక్కుకున్నాడు. 
 
దీంతో వేగంగా వచ్చిన బస్సు డ్రైవర్ ఆ వ్యక్తిని గమనించి బస్సును ఆపేశాడు. అదేసమయంలో ఆ వ్యక్తి కిందపడిపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కిందపడిన వ్యక్తి ఏమీ జరగనట్టుగా లేచి నడుకుంటూ వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో చూస్తుంటే శరీరం గగుర్పాటుకు గురిచేస్తుంది. ఈ వీడియో చేర్ చేసిన నెటిజన్... ఇది మిరాకిల్ అంటూ కామెంట్స్ చేశాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments