భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి మృతి

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (12:25 IST)
ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి అనారోగ్య సమస్యల కారణంగా న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. గత ఏడు నెలలుగా ఐసియులో ఉన్నారని ఆమె కార్యదర్శి గణేష్ తెలిపారు. ఆమె వయసు 84. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. 
 
Yamini Krishnamurthy
ముంగర యామిని కృష్ణమూర్తి డిసెంబర్ 20, 1940న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జన్మించారు. ఆమె భటనాట్యం  కూచిపూడి స్టైల్స్ ఆఫ్ డ్యాన్స్‌లో నిష్ణాతురాలు. ఆమె పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినప్పటికీ, ఆమె తమిళనాడులోని చిదంబరంలో పెరిగారు. ఆమె తొలి ప్రదర్శన 1957లో మద్రాసులో జరిగింది. 
 
ఈమె కూచిపూడి నాట్య టార్చ్ బేరర్‌గా మాత్రమే కాకుండా టీటీడీ ఆస్థాన నర్తకి కూడా. ఆమె సుదీర్ఘ కెరీర్‌లో రాణించిన ఆమె పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అనేక అత్యున్నత పౌర పురస్కారాలను కూడా గెలుచుకున్నారు.
 
ఆమె గొప్ప ప్రతిభను గుర్తించి సాంబవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆమెను నాట్య శాస్త్ర అవార్డుతో సత్కరించింది. ఆమె న్యూ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అనే డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించి యువ డ్యాన్సర్‌లకు పాఠాలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments