Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేసి యువతిపై అఘాయిత్యం.. మరోచోట భర్తే ఆ పని చేశాడు..?

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (15:20 IST)
దేశంలో మహిళలకు భద్రత కరువైంది. నిర్భయ, దిశ తరహా ఘటనలు జరుగుతూనే వున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా తమిళనాడులోని వెల్లూరులో దారుణం చోటుచేసుకుంది.  24 ఏళ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. నిందితులు బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేసి.. ఆమెకు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంకా వారి వద్ద వున్న డబ్బును, వస్తువులను దోచుకెళ్లారు. వేలూరు కోట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో 18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరొకరి కోసం గాలిస్తున్నారు.
 
మరోవైపు ఒడిశాలో కూడా కామాంధులు రెచ్చిపోయాయి. ఓ మహిళపై.. ఆమె భర్త తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్యభర్త కలిసి వెకేషన్‌ కోసం బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భార్యను వెకేషన్‌కంటూ ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లి.. అక్కడ అతడి స్నేహితులు ముగ్గురితో అత్యాచారానికి పాల్పడేలా చేశాడు. ఆ తర్వాత ఆమె భర్త కూడా అదే పని చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments