Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో భారత సంతతి యువతి శవమై తేలింది.. డిసెంబరులో మిస్సై..?

Advertiesment
India
, శనివారం, 18 జనవరి 2020 (13:44 IST)
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. గత నెల డిసెంబర్ 27న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలోని భారతీయ సమాజంలో విషాదం నెలకొంది. గత డిసెంబరులో కనిపించకుండాపోయిన సురీల్ దాబావాలా అనే 33 ఏళ్ల యువతి శవమై తేలింది. 
 
చికాగోలోని లయోలా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న సురీల్ డిసెంబరు 30న అదృశ్యమైంది. ఆమె తండ్రి అష్రాఫ్ దాబావాలా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా తన కుమార్తె ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల రివార్డు కూడా ప్రకటించారు.
 
తాజాగా, తన సొంత కారులోనే విగతజీవిగా పడివున్న సురీల్‌ను ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ గుర్తించింది. చికాగో పరిసరాల్లో కారు డిక్కీలో సురీల్ మృతదేహం దుప్పట్లో చుట్టి ఉంది. సురీల్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసులో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓయూలో టెన్షన్.. ప్రొఫెసర్‌కు మావోలతో లింకుందా?