Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగ‌నా పిచ్చిత‌న‌మా..? లేక దేశ‌ద్రోహమా? వరుణ్ గాంధీ ఫైర్

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (16:45 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'భార‌త‌దేశానికి 2014లో స్వాతంత్ర్యం వ‌చ్చింది.. 1947లో స్వాతంత్ర్యం రాలేదు.. అది భిక్షం' అని కంగ‌నా వ్యాఖ్యానించింది. ఓ జాతీయ స్థాయి న్యూస్ ఛానెల్‌లో కంగ‌నా ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 
 
వీటిపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ ఘాటుగానే స్పందించారు. కంగ‌నా పిచ్చిత‌న‌మా..? లేక దేశ‌ద్రోహంగా భావించాలా అని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల ప‌ద్మ శ్రీ అవార్డు అందుకున్న కంగ‌నా.. ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కొనియాడారని గుర్తుచేశారు. 
 
భార‌త జాతిపిత మ‌హాత్మాగాంధీ త్యాగాల‌ను అవ‌మానించ‌డం స‌రికాదన్నారు. గాంధీని చంపిన గాడ్సేను పొగ‌డ‌డం దారుణ‌మ‌న్నారు. ఇప్పుడేమో.. మంగ‌ళ్ పాండే, రాణి ల‌క్ష్మీభాయి, భ‌గ‌త్ సింగ్, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌తో పాటు ల‌క్ష‌లాది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులను అగౌర‌వించ‌డం స‌రికాదు అని వరుణ్ గాంధీ హితవు పలికాలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments