Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగ‌నా పిచ్చిత‌న‌మా..? లేక దేశ‌ద్రోహమా? వరుణ్ గాంధీ ఫైర్

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (16:45 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'భార‌త‌దేశానికి 2014లో స్వాతంత్ర్యం వ‌చ్చింది.. 1947లో స్వాతంత్ర్యం రాలేదు.. అది భిక్షం' అని కంగ‌నా వ్యాఖ్యానించింది. ఓ జాతీయ స్థాయి న్యూస్ ఛానెల్‌లో కంగ‌నా ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 
 
వీటిపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ ఘాటుగానే స్పందించారు. కంగ‌నా పిచ్చిత‌న‌మా..? లేక దేశ‌ద్రోహంగా భావించాలా అని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల ప‌ద్మ శ్రీ అవార్డు అందుకున్న కంగ‌నా.. ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కొనియాడారని గుర్తుచేశారు. 
 
భార‌త జాతిపిత మ‌హాత్మాగాంధీ త్యాగాల‌ను అవ‌మానించ‌డం స‌రికాదన్నారు. గాంధీని చంపిన గాడ్సేను పొగ‌డ‌డం దారుణ‌మ‌న్నారు. ఇప్పుడేమో.. మంగ‌ళ్ పాండే, రాణి ల‌క్ష్మీభాయి, భ‌గ‌త్ సింగ్, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌తో పాటు ల‌క్ష‌లాది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులను అగౌర‌వించ‌డం స‌రికాదు అని వరుణ్ గాంధీ హితవు పలికాలు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments