Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కొంటే టమోటాలు ఫ్రీ - టమోటా దుకాణానికి ఎస్కార్ట్ భద్రత.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 10 జులై 2023 (08:59 IST)
దేశ వ్యాప్తంగా టమోటాల ధర విపరీతంగా పెరిగిపోయింది. అనేక రాష్ట్రాల్లో కేజీ టమోటాలు సెంచరీ ధరను దాటిపోయాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన ఓ మొబైల్ కంపెనీ వ్యాపారి అభిషేక్ వినూత్నంగా ఆలోచన చేశాడు. తమ షాపులో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్‌కు రెండు కేజీల టమోటాలను ఉచితంగా ఇస్తానంటూ ప్రకటన చేశారు. దీంతో అతని షాపులో స్మార్ట్‌ ఫోన్లు అమ్మకం సంగతి అటుంచితే షాపుకు మాత్రం విపరీతమైన ప్రచారం లభించింది. 'ఆఫర్ ప్రకటించిన తర్వాత తన దుకాణానికి వచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది అని అభిషేక్ చెప్పాడు.
 
మరోవైపు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అజయ్ ఫౌజీ అనే టమోటాల వ్యాపారి తన దుకాణానికి ఏకంగా ప్రైవేటు భద్రతను నియమించుకున్నారు. వినియోగదారులు దుకాణాలకు ఎగబడటమే కాక, కొన్ని చోట్ల చోరీలు కూడా చేస్తున్నారని, అందుకే భద్రత కోసం బౌన్సర్లను దుకాణం వద్ద మోహరించామని తెలిపారు. 
 
మరోవైపు, తమిళనాడులోని కడలూరుకు చెందిన రాజేశ్.. తన కూరగాయల దుకాణం నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 550 కిలోల టమోటాలను రూ.20కి కిలో చొప్పున విక్రయించాడు. కిలోకు రూ.20 అని ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే అన్ని టమోటాలు అమ్ముడు పోయాయని ఆయన తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments