Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కొంటే టమోటాలు ఫ్రీ - టమోటా దుకాణానికి ఎస్కార్ట్ భద్రత.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 10 జులై 2023 (08:59 IST)
దేశ వ్యాప్తంగా టమోటాల ధర విపరీతంగా పెరిగిపోయింది. అనేక రాష్ట్రాల్లో కేజీ టమోటాలు సెంచరీ ధరను దాటిపోయాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన ఓ మొబైల్ కంపెనీ వ్యాపారి అభిషేక్ వినూత్నంగా ఆలోచన చేశాడు. తమ షాపులో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్‌కు రెండు కేజీల టమోటాలను ఉచితంగా ఇస్తానంటూ ప్రకటన చేశారు. దీంతో అతని షాపులో స్మార్ట్‌ ఫోన్లు అమ్మకం సంగతి అటుంచితే షాపుకు మాత్రం విపరీతమైన ప్రచారం లభించింది. 'ఆఫర్ ప్రకటించిన తర్వాత తన దుకాణానికి వచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది అని అభిషేక్ చెప్పాడు.
 
మరోవైపు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అజయ్ ఫౌజీ అనే టమోటాల వ్యాపారి తన దుకాణానికి ఏకంగా ప్రైవేటు భద్రతను నియమించుకున్నారు. వినియోగదారులు దుకాణాలకు ఎగబడటమే కాక, కొన్ని చోట్ల చోరీలు కూడా చేస్తున్నారని, అందుకే భద్రత కోసం బౌన్సర్లను దుకాణం వద్ద మోహరించామని తెలిపారు. 
 
మరోవైపు, తమిళనాడులోని కడలూరుకు చెందిన రాజేశ్.. తన కూరగాయల దుకాణం నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 550 కిలోల టమోటాలను రూ.20కి కిలో చొప్పున విక్రయించాడు. కిలోకు రూ.20 అని ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే అన్ని టమోటాలు అమ్ముడు పోయాయని ఆయన తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments