Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త దంపతుల జీవితంలో పెను విషాదం మిగిల్చిన విహార యాత్ర

Webdunia
సోమవారం, 10 జులై 2023 (08:41 IST)
నూతన దంపతుల జీవితంలో విహార యాత్ర పెను విషాదం నింపింది. ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లా గులార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున బస్సు గంగా నదిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవి (30) ప్రాణాలు కోల్పోయాడు. ఈయన భార్య కల్యాణి విషమ పరిస్థితుల్లో రిషికేష్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 
 
మొత్తం 11 మంది యాత్రికులతో కేదార్నాథ్ నుంచి వెళ్తున్న బస్సు మల్కుంటి బ్రిడ్జి-హోటల్ ఆనంద్ కాశీ మధ్య నదిలో కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటన రిషికేశ్ - బద్రీనాథ్ జాతీయ రహదారిపై జరిగింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఐదుగురిని రక్షించింది. రవి సహా ముగ్గురు చనిపోయారు. 
 
మృతుడు హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఈయనకు ఫిబ్రవరి నెల 12వ తేదీన కళ్యాణితో వివాహమైంది. ఈ నెల 5న వీరు యాత్రకు బయల్దేరారు. యమునోత్రి, గంగోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్‌కు టూర్ ప్లాన్ చేసుకున్నారు. కేదార్నాథ్ కొండపైకి వెళ్లేందుకు శనివారం సాయంత్రం రవి దంపతులు బస్సు ఎక్కి ప్రమాదంలో చిక్కుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments