Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ ప్రారంభించిన 'వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్'కు ప్రమాదం...

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (08:11 IST)
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ నగర్ - ముంబైల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రమాదానికి గురైంది. గేదెలు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైలు ముందుభాగంలో అమర్చిన డోమ్‌కు అమర్చిన  మెటల్ ప్లేట్ ఒకటి ఊడిపోయింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు 
 
ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ ప్రాంతాల మధ్య నడిచే ఈ రైలు గురువారం ఉదయం గుజరాత్‌లోని వాత్వా, మణి నగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. గేదెలు అడ్డురాగా, వాటిని గమనించిన లోకో పైలెట్ షడన్ బ్రేక్ వేశారు. అయినప్పటికీ ఓ గేదెను రైలు ఢీకొట్టింది. 
 
దీంతో రైలు ముందు భాగంలోని డోమ్‌కు ఉన్న ఒక మెటల్ ప్లేట్ ఊడిపోయింది. ఈ ప్రమాదంపై విపక్షాల నేతలు సెటైర్లు సంధిస్తున్నారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ఆరు రోజుల్లోనే వందే భారత్ రైలు ప్రమాదానికి గురైందంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. 
 
అయితే, ఈ ప్రమాదంపై భారత రైల్వే శాఖ స్పందించింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగంలో మెటల్ ప్లేట్ మాత్రమే విరిగిందని, ప్రమాదం జరిగిన 8 నిమిషాల్లోనే రైలు బయలుదేరి గాంధీ నగర్‌కు సకాలంలోనే చేరుకుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments