ప్రధాని మోడీ ప్రారంభించిన 'వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్'కు ప్రమాదం...

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (08:11 IST)
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ నగర్ - ముంబైల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రమాదానికి గురైంది. గేదెలు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైలు ముందుభాగంలో అమర్చిన డోమ్‌కు అమర్చిన  మెటల్ ప్లేట్ ఒకటి ఊడిపోయింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు 
 
ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ ప్రాంతాల మధ్య నడిచే ఈ రైలు గురువారం ఉదయం గుజరాత్‌లోని వాత్వా, మణి నగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. గేదెలు అడ్డురాగా, వాటిని గమనించిన లోకో పైలెట్ షడన్ బ్రేక్ వేశారు. అయినప్పటికీ ఓ గేదెను రైలు ఢీకొట్టింది. 
 
దీంతో రైలు ముందు భాగంలోని డోమ్‌కు ఉన్న ఒక మెటల్ ప్లేట్ ఊడిపోయింది. ఈ ప్రమాదంపై విపక్షాల నేతలు సెటైర్లు సంధిస్తున్నారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ఆరు రోజుల్లోనే వందే భారత్ రైలు ప్రమాదానికి గురైందంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. 
 
అయితే, ఈ ప్రమాదంపై భారత రైల్వే శాఖ స్పందించింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగంలో మెటల్ ప్లేట్ మాత్రమే విరిగిందని, ప్రమాదం జరిగిన 8 నిమిషాల్లోనే రైలు బయలుదేరి గాంధీ నగర్‌కు సకాలంలోనే చేరుకుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments