Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి చిన్నారులకు వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి వెల్లడి

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (16:53 IST)
ఈ నెల 16వ తేదీ నుంచి 12 -14 సంవత్సరాల వయుస్సున్న చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేయనున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
కరోనా వైరస్ బారినపడకుండా, ఒకవేళ ఈ వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు వీలుగా పెద్దలకు తొలుత కరోనా టీకాలు వేశారు. ఆ తర్వాత 15 -18 యేళ్ల మధ్య ఉన్న చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 12-14 యేళ్లు ఉన్న చిన్నారులకు ఈ టీకాలు వేయనున్నట్టు తెలిపారు. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు 12-14 యేళ్ల మధ్య పిల్లలతో పాటు 60 యేళ్ళకు పైబడిన వాళ్ళకి ప్రికాషన్ డోసు ప్రక్రియను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. దేశంలో కొన్ని నెలలుగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 1,79,91,57,4876 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments