Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో వరదల్లో కొట్టుకునిపోయిన కారు - 9 మంది జలసమాధి

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (15:21 IST)
నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, ఉత్తరభారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌లో వర్షాల కారణంగా రామ్‌నగర్‌లో దెల్హా నది పొంగిపొర్లడంతో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది జలసమాధి అయ్యారు. మరో ఐదుగురు వరదలో చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఒక బాలికను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. 
 
అలాగే మహారాష్ట్ర, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంది. దీంతో గోవా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరు బయటకు రావొవద్దని హెచ్చరించింది. 
 
అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడొచ్చనే సూచనలతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మశోబరా ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో మొత్తం బురదమయంగా మారిపోయింది. అస్సాంలో వరదలు కొంతమేరకు శాంతించాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments