Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను ముక్కలుముక్కలుగా నరికేసిన భర్త.. ఎందుకంటే...

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (11:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. దీనికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరూ విస్తుపోతారు. మూడోసారి ఆడపిల్లే పడుతుందని తేలడంతో ఆ కసాయి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ జిల్లా డీహ్ అనే గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, డీహ్‌ గ్రామానికి చెందిన రవీంద్రకుమార్‌(35), ఊర్మిళ(27) అనే భార్యభర్తలు ఉన్నారు. వీరికి 2011లో వివాహమైంది. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఈ క్రమంలో ఊర్మిళ మూడోసారి గర్భందాల్చింది. అయితే, ఈసారి కూడా ఆమె అమ్మాయికే జన్మనిస్తుందని అనుమానించిన భర్త రవీంద్రకుమార్ భార్యను హింసించడం మొదలుపెట్టాడు. దీంతో ఈ నెల 12న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కట్టుకున్న భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించిన రవీంద్రకుమార్ ఆమెను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో ఉద్దేశ్యపూర్వకంగా భార్యతో గొడవ పెట్టుకుని.. ఆమె గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత తన తండ్రి, సోదరుల సహాయంతో భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పిండిమరలో వేసి ముద్దచేశాడు. అక్కడితోనూ ఆగక కాల్చి బూడిద చేశాడు. ఆ తర్వాత మూటకట్టి అటవీ ప్రాంతంలో పడేశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
అయితే, తమ తల్లిని తండ్రి చంపడాన్ని కళ్ళారా చూశామని పెద్ద కుమార్తె అమ్మమ్మకు చెప్పింది. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న ఊర్మిళ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments