కరోనా లాక్డౌన్ కేసులన్నీ ఉపసంహరణ.. సీఎం యోగి నిర్ణయం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:12 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేశాయి. అయినప్పటికీ అనేక మంది ఈ లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించారు. ఇలాంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇపుడు ఈ కేసులను ఉపసంహరించుకోనున్నట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 
 
రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన సామాన్యులపై గతంలో వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా రాష్ట్రంలోని కొన్ని లక్షల మందికి ఉపశమనం కలగనుంది. 
 
సీఎ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన లాక్డౌన్ ఉల్లంఘన కేసులను ఉపసంహరించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వ్యాపారులపై వేసిన ‘ఉల్లంఘన’ కేసులను ఇటీవలే వెనక్కి తీసుకున్నారు. 
 
ఇప్పుడు సాధారణ ప్రజానీకంపై వేసిన కేసులు ఉపసంహరించనున్నారు. కాగా దేశంలో తొలిసారిగా లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కేసులను వెనక్కి తీసుకున్న తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments