Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ల నిర్లక్ష్యం.. ఒకే సిరంజితో ఇంజెక్షన్లు.. బాలికకు హెచ్.ఐ.వి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (11:16 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వైద్యులు తమ విధుల్లో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా ఓ బాలికకు హెచ్.ఐ.వి సోకేందుకు కారణమయ్యారు. ఒకే సిరంజితో అనేక మంది చిన్నారులకు ఇంజెక్షన్ వేశారు. దీంతో ఓ బాలికకు హెచ్.ఐ.వి. సోకింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. 
 
ఒక్కటే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం వల్ల బాలికకు హెచ్.ఐ.వి సోకింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్‌ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. 
 
ఒకే సిరింజితో అనేక మంది విద్యార్థులకు ఇంజెక్షన్ వేసిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఎతాలోని రాణి అవంతి భాయిలోధి ప్రభుత్వ వైద్య కాలేజీ‌ని ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ ఆదేశించినట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments