Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ల నిర్లక్ష్యం.. ఒకే సిరంజితో ఇంజెక్షన్లు.. బాలికకు హెచ్.ఐ.వి

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (11:16 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వైద్యులు తమ విధుల్లో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా ఓ బాలికకు హెచ్.ఐ.వి సోకేందుకు కారణమయ్యారు. ఒకే సిరంజితో అనేక మంది చిన్నారులకు ఇంజెక్షన్ వేశారు. దీంతో ఓ బాలికకు హెచ్.ఐ.వి. సోకింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. 
 
ఒక్కటే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం వల్ల బాలికకు హెచ్.ఐ.వి సోకింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్‌ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. 
 
ఒకే సిరింజితో అనేక మంది విద్యార్థులకు ఇంజెక్షన్ వేసిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఎతాలోని రాణి అవంతి భాయిలోధి ప్రభుత్వ వైద్య కాలేజీ‌ని ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ ఆదేశించినట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments