Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రెండో దశ ఎన్నికల పోలింగ్ : యూపీలో 55 సీట్లకు పోలింగ్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:57 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రెండో దశ పోలింగ్ జరుగుతోంది ఇందులోభాగంగా, అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలలో అధికార బీజేపీకి ఏమాత్రం సానుకూలంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కమలనాథుల్లో ఆందోళన నెలకొంది. పైగా, ఈ స్థానాల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థుల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. 
 
ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ముఖ్య నేతల్లో గత 1989 నుంచి షాజన్‌పూర్ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న బీజేపీ సీనియర్ నేత సురేష్ ఖన్నా తొమ్మిదో సారి కూడా విజయకేతనం ఎగురవేయాలని భావిస్తున్నారు. 
 
అలాగే, రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ ఎమ్మెల్యేగా పని చేసి ప్రస్తుతం రాంపూర్ లోక్‌సభ సభ్యుడుగా ఉన్న అజంఖాన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాంపూర్, సంభాల్, అమ్రెహా, ఛమ్రువా, నగినా వంటి స్థానాల్లో ముస్లిం ఓటర్లను అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 
 
అయితే, గత 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 55 సీట్లలో బీజేపీ 38, ఎస్పీ 15 స్థానాల్లో గెలుపొందాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. కానీ, ఈ దఫా పరిస్థితి తారుమారైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments