Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు ఆరో దశ పోలింగ్

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (08:08 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఆరో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 10 జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగతుంది. గోరఖ్‌పూర్‌తో సహా పది జిల్లాల్లో 57 నియోజకవర్గాలకు మార్చి 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా పోలింగ్ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అజయ్ కుమార్ శుక్లా వెల్లడించారు. 
 
ఈ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేసినట్టు ఆయన తెలిపారు. ఈ దశలో మొత్తం 2.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
కాగా, గత 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 57 సీట్లలో బీజేపీకి, దాని మిత్రపక్షాలైన ఆప్నాదళ్ ఎస్, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలు ఏకంగా 46 సీట్లను గెలుచుకున్నాయి. ఈ మొత్తం సీట్లలో 11 సీట్లు రిజర్వుడ్ స్థానాలు. చివరి దశ పోలింగ్ మార్చి 7వ తేదీన జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments