ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు ఆరో దశ పోలింగ్

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (08:08 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఆరో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 10 జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగతుంది. గోరఖ్‌పూర్‌తో సహా పది జిల్లాల్లో 57 నియోజకవర్గాలకు మార్చి 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా పోలింగ్ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అజయ్ కుమార్ శుక్లా వెల్లడించారు. 
 
ఈ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేసినట్టు ఆయన తెలిపారు. ఈ దశలో మొత్తం 2.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
కాగా, గత 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 57 సీట్లలో బీజేపీకి, దాని మిత్రపక్షాలైన ఆప్నాదళ్ ఎస్, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలు ఏకంగా 46 సీట్లను గెలుచుకున్నాయి. ఈ మొత్తం సీట్లలో 11 సీట్లు రిజర్వుడ్ స్థానాలు. చివరి దశ పోలింగ్ మార్చి 7వ తేదీన జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments