Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం.. దళిత బాలుడిని కొట్టి కాళ్లు నాకించిన వైనం...

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (12:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ దళిత బాలుడిని చితకబాదిన కొందరు వ్యక్తులు ఆ తర్వాత తమ కాళ్లు నాకించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో దళిత బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు తల్లి నిందితుల్లోని ఓ యువకుడి పొలాల్లో కూలీ పనులకు వెళ్లేది. గత కొన్ని రోజులుగా దినకూలీ ఇవ్వలేదు. దీంతో ఆ బాలుడు కూలీ డబ్బులు ఇవ్వాలని కోరాడు. అంతే.. కొందరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. 
 
ఆ బాలుడిని మొదట బెల్టుతో కొట్టారు. ఆ తర్వాత కూడా వదిలిపెట్టలేదు. కాళ్లు నాకాలని నిందితులు డిమాండ్ చేశారు. ఆ బాలుడు ఏడుస్తూ తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడినప్పటికీ వదిలిపెట్టలేదు. ఆ సమయంలో భయపడిపోతున్న ఓ దళితబాలుడిని చూస్తూ కొందరు గట్టిగా నవ్వారు. ఇంటువంటి తప్పు మరోమారు చేస్తావా? అంటూ గద్దించారు. 
 
ఈ వీడియో వైరల్ కావడంతో నిందితులు ప్లేటు మార్చారు. ఆ బాలుడు స్థానికంగా గంజాయి అమ్ముతున్నట్టు ఆరోపిస్తున్నారు. వాళ్లు కొట్టే దెబ్బలు తాళలేక వారు చేసిన ఆరోపణలను ఆ బాలుడు అంగీకరించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన యూపీ పోలీసులు  కేసు నమోదు చేసి ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments