Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటుకు మరణించిన కుమారుడు.. బతికొస్తాడంటూ పూజలు

Snake
Webdunia
మంగళవారం, 26 జులై 2022 (10:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాము కాటుడు ఓ బాలుడు మరణించాడు. కానీ, అతని తల్లిదండ్రులకు మాత్రం తమ కుమారుడిపై ఉన్న ప్రేమ చనిపోలేదు. బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించినప్పటికీ అంత్యక్రియలు చేసేందుకు సమ్మతించలేదు. పైగా, తమ బిడ్డ బతికివస్తాడన్న ఆశతో 30 గంటల పాటు వివిధ రకాల పూజలు చేశారు. అప్పటికీ అతనిలో ఎలాంటి చలనం లేకపోవడంతో చనిపోయాడని నమ్మి అంత్యక్రియలు చేశారు 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్‌పురి జిల్లా జాటవాన్‌ మొహల్లా గ్రామంలో జరిగింది ఈ గ్రామానికి చెందిన తాలీబ్‌ అనే బాలుడిని శుక్రవారం పాము కాటేసింది. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
అయినా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నమ్మలేదు. ఎలాగైనా బతికించుకోవాలన్న ఉద్దేశంతో తాంత్రికులను, పాములను పట్టే వారిని తీసుకొచ్చారు. సుమారు 30 గంటల పాటు పూజలు చేశారు. 
 
తాలీబ్‌ను కాటేసిన పామును పట్టుకునేందుకు నలుగురిని రప్పించారు. యువకుడి మృతదేహం వద్ద వేప, అరటి కొమ్మలను పెట్టి పూజలు చేశారు. ఎంత శ్రమించినా తాలీబ్‌లో చలనం లేకపోవడంతో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments