Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి మాటలు చెబుతున్నాడనీ తండ్రిపై కత్తితో కొడుకు దాడి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (13:00 IST)
చెడు తిరుగుళ్లు తిరగకుండా సత్ మార్గంలో నడుచుకోవాలంటూ నాలుగు మంచి మాటలు చెప్పిన తండ్రిపై ఓ కుమారుడు పైశాచికంగా దాడిచేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని జమునానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జులాయ్‌గా తిరుగుతుండేవాడు. పైగా, కేంద్రం నిషేధించిన పబ్‌జీని గంటల కొద్దీ ఆడుతూ వుండేవాడు. దీన్ని గమనించిన తండ్రి... అన్ని గంటలు పబ్‌జీ ఆడకురా అని కుమారుడికి మంచి చెప్పాడు. ఇదే ఆ తండ్రి చేసిన పాపం. 
 
అంతే ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన కొడుకు.. నన్నే ఆడుకోవద్దంటావా అంటూ ఉన్మాదిగా మారి తండ్రిపై దాడికి తెగబడ్డాడు. కత్తితో ఆయన గొంతు కోసేశాడు. తండ్రి రక్తంతో తడిసిన దుస్తులతో అలాగే వడివడిగా ఇంట్లోంచి బయటకొచ్చాడు.
 
అంతటితో ఆగక.. తనకు ఎదురుపడిన వారందరిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. తాను ఏం చేస్తున్నాడో తెలియనిస్థితిలో ఉన్న అతడు తనను తాను కూడా గాయపరుచుకున్నాడు. ఈ ఘటనలో తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం తండ్రి కొడుకులిద్దరూ మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments