Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి మాటలు చెబుతున్నాడనీ తండ్రిపై కత్తితో కొడుకు దాడి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (13:00 IST)
చెడు తిరుగుళ్లు తిరగకుండా సత్ మార్గంలో నడుచుకోవాలంటూ నాలుగు మంచి మాటలు చెప్పిన తండ్రిపై ఓ కుమారుడు పైశాచికంగా దాడిచేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని జమునానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జులాయ్‌గా తిరుగుతుండేవాడు. పైగా, కేంద్రం నిషేధించిన పబ్‌జీని గంటల కొద్దీ ఆడుతూ వుండేవాడు. దీన్ని గమనించిన తండ్రి... అన్ని గంటలు పబ్‌జీ ఆడకురా అని కుమారుడికి మంచి చెప్పాడు. ఇదే ఆ తండ్రి చేసిన పాపం. 
 
అంతే ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన కొడుకు.. నన్నే ఆడుకోవద్దంటావా అంటూ ఉన్మాదిగా మారి తండ్రిపై దాడికి తెగబడ్డాడు. కత్తితో ఆయన గొంతు కోసేశాడు. తండ్రి రక్తంతో తడిసిన దుస్తులతో అలాగే వడివడిగా ఇంట్లోంచి బయటకొచ్చాడు.
 
అంతటితో ఆగక.. తనకు ఎదురుపడిన వారందరిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. తాను ఏం చేస్తున్నాడో తెలియనిస్థితిలో ఉన్న అతడు తనను తాను కూడా గాయపరుచుకున్నాడు. ఈ ఘటనలో తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం తండ్రి కొడుకులిద్దరూ మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments