Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రియురాలు లేకుండా నేను బతకలేను.. అందుకే ఇలా చేస్తున్నా...

Webdunia
సోమవారం, 22 జులై 2019 (14:13 IST)
తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు దూరమైందన్న బాధను తట్టుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రా జిల్లా రాయభ గ్రామానికి చెందిన శ్యాం శికార్‌వార్ అలియాస్ రాజ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇంతలో తన ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థమైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రేమికుడు శ్యాం తట్టుకోలేకపోయాడు. అంతే.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్యచేసుకున్నాడు. 
 
చనిపోయేముందు ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. నా ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. నా ప్రియురాలు లేకుండా నేను బతకలేను. ప్రియురాలు నాకు దూరమైందనే బాధ, ఒత్తిడి వల్ల గురుగ్రామ్ కంపెనీలో ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాను. 
 
అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని శ్యాం నాలుగు పేజీల లేఖను రాసిపెట్టి స్థానికంగా ఉండే దేవాలయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ లేఖలో రాసిపెట్టాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments