Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్పీ దిగాడనీ కొట్టి చంపేశారు.. కంచిలో తెలుగు యువకుడిపై ఖాకీల దాష్టీకం

సెల్పీ దిగాడనీ కొట్టి చంపేశారు.. కంచిలో తెలుగు యువకుడిపై ఖాకీల దాష్టీకం
, గురువారం, 4 జులై 2019 (12:55 IST)
కాంచీపురంలోని శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయంలో 40 యేళ్లకు ఒకసారి జరిగే అత్తివరదర్ ఉత్సవాలు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. ఈయన స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారితో సెల్ఫీ దిగాడు. దీన్ని గమనించిన విధుల్లో వుండే పోలీసులు.. ఆ యువకుడుని పట్టుకుని చితకబాదారు. దాంతో ఖాకీల దెబ్బలకు తాళలేక ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో జరిగింది. మృతి చెందిన యువకుడి పేరు ఆకాష్. రాజమండ్రి వాసి. ఆలయంలో బంగారు బల్లిని దర్శనం తర్వాత స్వామి వారిని దర్శనం చేసుకుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు... ఆకాష్ సెల్ఫీ దిగడంపై ఆగ్రహిస్తూ ముష్టిఘాతాలు కురిపించారు. దీంతో ఆకాష్ అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
తన బిడ్డను పోలీసులు కొట్టి చంపారంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం మరోరకంగా స్పందిస్తున్నారు. గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడని చెపుతున్నారు. మృతదేహాన్ని కంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఎంతో వైభవంగా జరుగుతున్న అత్తి వరదర్ వేడుకల్లో అకాష్ మృతి ఆలయంలో కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొలువు కోసం వెళితే కోర్కె తీర్చుకున్న గుంటూరు డీఎఫ్‌వో అధికారి!