Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అత్యంత కఠినమైన రాత పరీక్ష ఏది? ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఠాగూర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (10:26 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ సూచన చేశారు. మన దేశంలో నిర్వహించే రాత పరీక్షల్లో అత్యంత కఠినమైన పరీక్షపై ఆరా తీసి ఓ విషయాన్ని కనుగొన్నారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. నిజానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. 
 
దేశంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏది అన్నదే ఆ పోస్టులో ప్రధాన టాపిక్. "ఇటీవల నేను 12th ఫెయిల్ అనే సినిమా చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది కుర్రకారుతో మాట్లాడాను. మన దేశంలో నిర్వహించే రాత పరీక్షల్లో అత్యంత కఠినమైన పరీక్ష ఏది? అని అడిగాను. నేను మాట్లాడిన వారిలో ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నాడు. అతడు ఓ బిజినెస్ స్టార్టప్ ఏర్పాటులో పాలుపంచుకున్న వ్యక్తి. అతడు కూడా అత్యంత కఠినమైన పరీక్షగా యూపీఎస్సీ పరీక్షను పేర్కొన్నాడు. ఐఐటీ జేఈఈ కంటే యూపీఎస్సీ ఎగ్జామ్ చాలా కష్టమైనదని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అందరి అభిప్రాయం ఇదే అయితే... ఈ కింది జాబితాను వెంటనే మార్చాల్సిందే" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
 
పైగా, ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షల వరల్డ్ ర్యాంకింగ్ జాబితాను కూడా రీట్వీట్ చేశారు. ఆ జాబితాలో చైనాకు చెందిన గావో కావో పరీక్ష అత్యంత కఠినమైన పరీక్షగా నెం.1 స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఐఐటీ జేఈఈ, మూడో స్థానంలో యూపీఎస్సీ ఉంది. ఆనంద్ మహీంద్రా సర్వే ప్రకారం ఈ జాబితాలో యూపీఎస్సీ ఎగ్జామ్ రెండో స్థానానికి, ఐఐటీ జేఈఈ పరీక్ష మూడో స్థానానికి మార్చాల్సి ఉంటుందని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments