Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలు వేగం గంటకు సగటున 220 కిమీ...

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (10:21 IST)
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సెమీ హై స్పీడ్ రైళ్ళుగా భావించే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అయితే, వచ్చే రెండేళ్ళలో వందే భారత్ రైళ్ళలో అనేక మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను హై స్పీడ్ రైళ్ళ కేటగిరీ వేగాన్ని అందుకునే దిశగా మార్పులు చేయనున్నారు. 
 
ఈ మేరకు చెన్నైలోని ఐసీఎఫ్‌ నిపుణులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న వందేభారత్‌ రైల్వే కోచ్‌ల సామర్థాన్నిపెంచేందుకు అవసరమైన సాంకేతికతపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌ రైళ్లు ట్రాక్‌ సామర్థ్యాన్ని బట్టి గంటకు 60 నుంచి 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. రానున్న రోజుల్లో నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే దిశగా.. వందేభారత్‌ రైళ్ల వేగాన్ని పెంచేందుకు చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో ప్రణాళికలు రచిస్తున్నారు. 
 
భవిష్యత్తులో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 200 నుంచి 220 కి.మీ.కు పెంచాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు రైల్వే బోర్డుతోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ వేగాన్ని అందుకోవాలంటే వందేభారత్‌ రైళ్లలో సామగ్రిపరంగా మార్పులు తీసుకురావాలి. ప్రస్తుతం ఈ రైళ్లకు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లోహాన్ని వాడుతున్నారు. హైస్పీడ్‌ వేగాన్ని అందుకోవాలంటే అల్యూమినియం లోహంతో వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. ఇదంతా కార్యరూపం దాల్చడానికి, ప్రొటోటైప్‌ రైలు సిద్ధమవడానికి మరో రెండేళ్ల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. 
 
తర్వాత ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో ఈ వేగంతో రైళ్లను పరుగులు పెట్టించే అవకాశాలున్నాయి. దీనికి తగ్గట్లు సిగ్నలింగ్‌ వ్యవస్థలోనూ సాంకేతిక మార్పులు రానున్నాయి. భవిష్యత్తులో గంటకి 245 కి.మీ. వేగాన్ని అందుకునే సామర్థ్యంతో వందేభారత్‌ డిజైనింగ్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. కానీ పట్టాలపై మాత్రం దీని అత్యధిక వేగం గంటకు 220 కి.మీ.కు మించకుండా చేసే అవకాశముందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments