కోడిగుడ్డుకూర వండలేదని గన్‌తో భార్యను కాల్చేసిన భర్త

ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడిగుడ్డు కూర వండలేదని భార్యను ఓ భర్త తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్ పూర్ జిల్లాలోని దే

Webdunia
శనివారం, 14 జులై 2018 (14:58 IST)
ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడిగుడ్డు కూర వండలేదని భార్యను ఓ భర్త తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్ పూర్ జిల్లాలోని దేవదాస్ గ్రామానికి చెందిన 33 ఏళ్ల నవనీత్-మంగేశ్ శుక్లాకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. నవనీత్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 
 
అయితే నవనీత్ తాగుడుకు బానిస అయ్యాడు. గురువారం తప్పతాగి ఇంటికొచ్చాడు. కోడిగుడ్డు కూర వండాలని భార్యకు చెప్పాడు. కానీ కోడిగుడ్డుకూర వండేందుకు భార్య నిరాకరించడంతో నవనీత్‌ కోపంతో ఊగిపోయాడు. మద్యం మత్తులో ఉన్న నవనీత్ ఇంట్లోకి వెళ్లి తన తండ్రి లైసెన్స్‌డ్ గన్‌ను తీసుకువచ్చి భార్య శుక్లాపై కాల్పులు జరిపాడు. 
 
ఈ ఘటనలో గాయపడిన శుక్లాను స్థానికులు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై శుక్లా సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments