Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఢిల్లీ తరహా ఘటన.. కదిలే బస్సులో మహిళపై అత్యాచారం..

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (10:35 IST)
నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అనగానే ఈ ఘటనే గుర్తుకు వస్తుంది. ఈ ఘటన తర్వాత నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. కామాంధులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా యూపీలో ఢిల్లీ తరహా ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ప్రతాప్ గడ్ నుంచి నోయిడాకు 25 ఏళ్ల మహిళ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో అత్యాచారానికి గురైంది. 
 
కదులుతున్న బస్సులో బస్సు డ్రైవర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతాప్ గడ్‌లో బస్సు ఎక్కిన సమయంలో బస్సు డ్రైవర్లు ఆమెకు వెనుక సీటు కేటాయించారు. బస్సు ఎక్కే సమయంలోనే ఇద్దరు డ్రైవర్లు ఆమెపై కన్నేశారు. లక్నో, మధుర మధ్య ప్రాంతంలో బస్సులోని ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని.. నోయిడాలో దిగిన ఆ మహిళ తన భర్తకు జరిగిన విషయం చెప్పి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు డ్రైవర్లలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరికోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments