Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త పిల్లలను వదిలేసి బిచ్చగాడితో పారిపోయిన మహిళ.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (19:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త, ఆరుగురు పిల్లలను వదిలివేసి బిచ్చగాడితో లేచిపోయింది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ మహిళ, బిచ్చగాడి కోసం గాలిస్తున్నారు. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజు (45) అనే వ్యక్తి తన భార్య రాజేశ్వరి (36), ఆరుగురు పిల్లలతో కలిసి హర్దోయ్‌లోని హర్పాల్పూర్ ప్రాంతంలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో నాన్హే పండిట్ (45) అనే బిచ్చగాడు భిక్షాటన చేసేవాడు. అయితే, అతడు తరచూ రాజేశ్వరితో మాట్లాడేవాడు. చివరికి వారు ఫోనులో కూడా మాట్లాడుకునే వరకు వారి మధ్య పరిచయం ఏర్పడింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాజేశ్వరి బట్టలు, కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్‌కి వెళుతున్నానని తన కుమార్తె ఖుష్బూకు చెప్పి బయటకు వెళ్లింది. కానీ, ఆమె ఎంతకు తిరిగి రాకపోవడంతో రాజు చుట్టుపక్కల అంతా వెతికాడు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. 
 
అదేసమయంలో తన గేదెను విక్రయించగా వచ్చిన డబ్బు కూడా ఇంట్లో కనిపించలేదు. దాంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె ఇంట్లోని డబ్బు తీసుకుని నాన్హే పండిట్‌తో వెళ్లిపోయి ఉండొచ్చని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 87 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిచ్చగాడు నాన్హే పండిట్, రాజేశ్వరి కోసం గాలించగా, రాజేశ్వరి ఆచూకీ పోలీసులకు దొరికింది. దాంతో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి శిల్పా కుమారి తెలిపారు. అలాగే పరారీలో ఉన్న నాన్హే పండిట్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments