Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త పిల్లలను వదిలేసి బిచ్చగాడితో పారిపోయిన మహిళ.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (19:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త, ఆరుగురు పిల్లలను వదిలివేసి బిచ్చగాడితో లేచిపోయింది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ మహిళ, బిచ్చగాడి కోసం గాలిస్తున్నారు. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజు (45) అనే వ్యక్తి తన భార్య రాజేశ్వరి (36), ఆరుగురు పిల్లలతో కలిసి హర్దోయ్‌లోని హర్పాల్పూర్ ప్రాంతంలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో నాన్హే పండిట్ (45) అనే బిచ్చగాడు భిక్షాటన చేసేవాడు. అయితే, అతడు తరచూ రాజేశ్వరితో మాట్లాడేవాడు. చివరికి వారు ఫోనులో కూడా మాట్లాడుకునే వరకు వారి మధ్య పరిచయం ఏర్పడింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాజేశ్వరి బట్టలు, కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్‌కి వెళుతున్నానని తన కుమార్తె ఖుష్బూకు చెప్పి బయటకు వెళ్లింది. కానీ, ఆమె ఎంతకు తిరిగి రాకపోవడంతో రాజు చుట్టుపక్కల అంతా వెతికాడు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. 
 
అదేసమయంలో తన గేదెను విక్రయించగా వచ్చిన డబ్బు కూడా ఇంట్లో కనిపించలేదు. దాంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె ఇంట్లోని డబ్బు తీసుకుని నాన్హే పండిట్‌తో వెళ్లిపోయి ఉండొచ్చని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 87 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిచ్చగాడు నాన్హే పండిట్, రాజేశ్వరి కోసం గాలించగా, రాజేశ్వరి ఆచూకీ పోలీసులకు దొరికింది. దాంతో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి శిల్పా కుమారి తెలిపారు. అలాగే పరారీలో ఉన్న నాన్హే పండిట్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments