కొందరు సఫారీ వాహనాల్లో పర్యాటక ప్రాంతానికి వెళ్లి పులిని చుట్టుముట్టారు. తామేదో ఘనకార్యం చేసినట్టుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో కోర్టు దృష్టికి వెళ్ళింది. దీంతో ఆ సఫారీ వాహనాల్లో వెళ్లి పులి, పులి పిల్లలను చుట్టుముట్టిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహారాష్ట్రలోని ఉమ్రేడ్ - పౌని - కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో పిల్లలతో ఉన్న పులిని సఫారీ వాహనాల్లో వెళ్లిన కొందరు చుట్టుముట్టారు. ఈ పర్యాటకులను చూసిన పులి, పులి పిల్లలు భయాందోళన చెందాయి. ఈ వీడియో వైరల్ కావడంతో మహారాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, ఈ ఘటనపై విచారణకు కోర్టు ఆదేశించింది.