వైద్యుడి ఇంట చోరీకి వచ్చి గుర్రుపెట్టి నిద్రపోయిన దొంగ...

వరుణ్
సోమవారం, 3 జూన్ 2024 (17:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ వైద్యుడి ఇంట దొంగతనం చేసేందుకు వచ్చేందుకు వచ్చిన ఓ దొంగ.. ఏసీ ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోయాడు. మద్యం మత్తు ఎక్కువై నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారి మెలకువ వచ్చేసరికి చుట్టుముటి ఉన్న పోలీసులను చూసి అవాక్కయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లక్నో నగరంలోని ఇందిరా నగర్ సెక్టర్ 20లో సునీల్ పాండే అనే వైద్యుడి ఇల్లు ఉంది. బలరామ్ పూర్ ఆస్పత్రిలో ఆయన పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారణాసిలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇల్లు ఖాళీగా ఉంచారు. అయితే, పాండే ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి పొరుగింటి వారికి సందేహం కలిగింది. వెళ్లి చూడగా అక్కడ ఓ దొంగ నిద్రిస్తూ కనిపించాడు. సామానంతా చెల్లాచెదురుగా పడి వుంది. దీంతో వారు వెంటనే పోలీసలకు సమాచారం అందించారు. ఈ క్రమంలో నిద్రలేచిన దొంగ తన చుట్టూత పోలీసులు ఉండటాన్ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. 
 
నిందితుడు ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువును దొంగిలించుకుపోయే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. తలుపు, కప్ బోర్డులు, పగలగొట్టాడని అన్నాడు. గ్యాస్ సిలిండర్, వాటర్ పంప్, వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని అన్నారు. వాటర్ పంప్, వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని చెప్పారు. వాటర్ పంప్ బ్యాటరీ తొలగించే క్రమంలో మద్యం మత్తు కారణంగా అతడు ఒక్కడే నిద్రపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఐసీసీ 379 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments