Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (18:11 IST)
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ దేశీయంగా తయారైన మొదటి సెమీ హైస్పీడ్ రైలు. ఈ నెల 15వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రారంభమైన మూన్నాళ్లకే గుర్తుతెలియని వ్యక్తులు అద్దాలను పగులగొట్టారు. రాళ్లు విసరడం వల్ల రైలు కిటీకి అద్దం ఒకటి పగిలిపోయిందని ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్‌ కుమార్‌ తెలిపారు. 
 
అంతకుముందు ఈ రైలు ట్రయర్ రన్ చేసే సమయంలో కూడా ఇలానే సంఘటన చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్ 20న ఢిల్లీ-ఆగ్రా మధ్య ట్రయల్ రన్ నిర్వహించే సమయంలోనూ ఇలానే రాళ్ల దాడి జరిగింది. కాగా రాళ్లు విసిరే వాళ్లలో చాలా మంది చిన్న పిల్లలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ పిల్లలందరికీ అవగాహన కల్పించారు. వందే భారత్ రైలుపై రాళ్లు విసరడం రెండునెలల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. 
 
ఫిబ్రవరి 15న ప్రారంభమైన ఈ రైలు రాళ్ల దాడులకు గురవుతోంది. అయితే ఈ రైలులో ప్రయాణ టిక్కెట్‌లు రెండు వారాల దాకా బుక్ అయినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments