Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్ జైల్లో పాకిస్థాన్ ఖైదీని చంపేశారు...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:50 IST)
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో ఒక్క దేశ ప్రజలు మాత్రమే కాదు.. దేశంలోని వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. దీనికి నిదర్శనమే ఈ దారుణ ఘటన. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌ జైల్లో ఉన్న పాకిస్థాన్ దేశానికి చెందిన ఖైదీని భారతీయ ఖైదీలు కొట్టి చంపేశారు. 
 
ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు గూఢచర్యం ఆరోపణలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మృతుడిని షకీర్‌గా గుర్తించారు. ఇదే జైల్లో శిక్షను అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు అతడిపై దాడిచేసి కొట్టిచంపేశారు. దీనిపై సమాచారం అందగానే సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు జైలుకు చేరుకుని విచారణ చేపట్టారు.
 
దీనిపై జైళ్ళ శాఖ ఐజీ రూపేందర్ సింగ్ స్పందిస్తూ, "‘ఓ పాకిస్థాన్ ఖైదీ జైపూర్ కేంద్ర కారాగారంలో హత్యకు గురైనట్టు సమాచారం అందింది.. దానిపై వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నాం" అని వెల్లడించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో ఆగ్రహంతో ఉన్న భారతీయ ఖైదీలు ఈ దారుణానికి ఒడిగట్టారు. 

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments