రోజూ ఎనిమిది లడ్డూలే ఆహారం.. విసిగిపోయి విడాకులు కోరిన భర్త

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (14:29 IST)
ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య అనుబంధం సన్నగిల్లిపోతుంది. స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా చిన్న చిన్న కారణాల కోసం విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. 
 
అలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ స్మార్ట్ ఫోన్ వల్ల దంపతులు విడాకులు కోరలేదు. తాంత్రికుడి సలహా మేరకు తన భార్య రోజు ఆహారానికి బదులు లడ్డూలే పెడుతుందని.. ఆహారం విషయంలో భార్యతో తనకు తరచూ గొడవలు వస్తున్నాయని.. అందుచేత విడాకులు ఇప్పించమని కోర్టు మెట్లెక్కాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బాధితుడికి పదేళ్ల క్రితం వివాహమయ్యింది. కోర్టుకెక్కిన దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు బాగానే సాగిన వీరి దాంపత్యంలో ఓ తాంత్రికుడి వల్ల కలతలు రేగాయి. గత కొద్ది కాలంగా బాధితుడు తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు. దాంతో అతడి భార్య ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. 
 
అతని సూచన మేరకు బాదితుడికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నాలుగేసి చొప్పున లడ్డూలను భోజనంగా పెట్టింది  ఉదయం నాలుగు, సాయంత్ర నాలుగు చొప్పున లడ్డూలు భోజనంగా పెడుతుంది. ఇక ఏ పదార్థాన్ని తీసుకోకూడదని షరతు పెట్టింది. 
 
దీంతో విసిగిపోయిన బాధితుడు.. భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అధికారులు వీరిద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చే పనిలో పడ్డారు. అప్పటికి మనసు మార్చుకోకపోతే.. విడాకులు ఇప్పిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments