Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోపుడు బండి వస్త్ర వ్యాపారికి ఇద్దరు బాడీగార్డులు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 20 జులై 2022 (09:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోపుడు బండిపై వస్త్రాలు అమ్ముకుంటూ పొట్టపోసుకునే ఓ చిరు వ్యాపారికి ఇద్దరు బాడీ గార్డులు ఉన్నారు. వారిద్దరూ తుపాకీలు చేతబట్టి ఆయనకు రక్షణగా ఉంటున్నారు. ఆయన వీధి వీధి తిరుగుతూ వస్త్రాల విక్రయిస్తుంటే ఆ సాయుధ బాడీగార్డులు ఆయనకు రక్షణగా ఉంటున్నారు. ఈ కథనం వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ఎటా జిల్లా చెందిన రామేశ్వర్‌ దయాల్‌ అనే వ్యక్తి తోపుడు బండిపై బట్టల వ్యాపారం చేస్తుంటారు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌ సింగ్‌ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. కులం పేరుతో జుగేంద్ర తనను దూషించారని రామేశ్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జుగేంద్ర నుంచి ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. 
 
మరోవైపు, తనకు పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ జుగేంద్ర హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే దయాల్‌ను కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకు వచ్చిన దయాల్‌ను చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. ఇద్దరు బాడీగార్డులను భద్రతగా నియమించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manoj: మిరాయ్ చూశాక ఆనందభరితమైన మంచు మనోజ్ తల్లి నిర్మాలాదేవి

Mirai Review: తేజ సజ్జ, మంచు మనోజ్ ల మిరాయ్ చిత్రంతో అనుకుంది సాధించారా.. రివ్యూ

Jabardasth Comedian: వైల్డ్ కార్డ్ ఎంట్రీ- బిగ్‌బాస్ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments