Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురాద్ నగర్ ఘటన కారకులపై ఎన్.ఎస్.సి కింద చర్యలు : సీఎం యోగి

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (20:59 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌లో మురాద్ నగర్‌లో జనవరి 3న ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్మశానవాటికలోని కాంప్లెక్స్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. 
 
ఈ మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు తలా పది లక్షల రూపాయలు అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఘటనకు కారకులైన వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 
 
కాగా… ఓ వ్యక్తి అంత్యక్రియలో పాల్గొనేందుకు బంధవులంతా శ్మశాన వాటికకు వచ్చారు. అదేసమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో వారంతా ఆ శ్మశాన వాటికలో ఉన్న కాంప్లెక్స్ గ్యాలరీలో తలదాచుకున్నారు. 
 
అయితే అది కొత్తగా నిర్మించినది కావడం, భారీ వర్షం కారణంగా పూర్తిగా నానడంతో గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో దానికింత తలదాచుకున్న వారంతా అందులో చిక్కుపోయారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments