Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ళ బాలిక కడుపులో మృతశిశువు!

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (11:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిదేళ్ళ బాలిక కడుపులో ఓ మృతశిశువును వైద్యులు గుర్తించారు. ఈ కారణంగానే ఆ బాలిక విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని ఖుషీ నగర్‌లోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ళ బాలిక పుట్టినప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంది. దీంతో అనేక మంది వైద్యుల వద్ద చూపించారు. కానీ, ఆ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. పైగా, మూఢనమ్మకం కలిగిన ఆ బాలిక తల్లిదండ్రులు వివిధ రకాల మంత్రాలు, తంత్రాలు చేయిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ బాలికకు కడుపు నొప్పి అధికం కావడంతో మరోమారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ ఆ బాలికకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ స్కానింగ్‌లో ఆ బాలిక కడుపులో ఉన్నది గడ్డ కాదని తల, కాళ్లు, చేతులు, కళ్లు ఉన్న ఓ మృతశిశువు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ బాలికకు ఆపరేషన్ చేశారు. అది విజయవంతం కావడంతో ఇకపై ఆ బాలిక తోటివారిలాగే సాఫీగా జీవితాన్ని గడపొచ్చని వైద్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments