Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో గేదెలను అలా దొంగలించారు..

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (13:11 IST)
ఉత్తరప్రదేశ్‌లో గేదెలను అలా దొంగలించారు. తుపాకీలతో వచ్చి.. మారణాయుధాలతో వచ్చి గేదేలను పట్టుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రత్నపురి గ్రామంలోని ఓ గేదెల యజమానిని దుండగులు బెదిరించారు. దాదాపు 25 మంది తుపాకులు, మారణాయుధాలు తీసుకుని వచ్చారు. 
 
యజమానిని బంధించి, తుపాకులు ఎక్కుపెట్టి 20 లక్షల రూపాయల విలువైన గేదెలను అపహరించుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. ఈ దపర్యాప్తులో నరేష్ కుమార్ (గేదెల యజమాని), ఆయన కుమారుడు మోహిత్‌లు ఓ డెయిరీ ఫామ్‌ను నిర్వహిస్తున్నారు.
 
దుండగులంతా, ఒక్కసారిగా లోపలికి ప్రవేశించి, వారిని బెదిరించారని, ఆపై తాము తెచ్చిన వాహనాల్లోకి గేదెలను ఎక్కించుకుని తీసుకెళ్లారు. వారివద్ద ఉన్న బైకు, రెండు మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. 
 
ఈ దోపిడీ తరువాత గ్రామస్తులు ఆగ్రహంతో, రహదారులను దిగ్బంధించి రాస్తారోకో చేశారని, పరిస్థితి అదుపు తప్పకుండా బందోబస్తును పెట్టామని వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments