Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి చెరకుతోటలోకి లాక్కెళ్లి.... నాలుక కోసి అత్యాచారం...

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేసి కేకలు పెట్టకుండా ఉండేందుకు నాలుకను కత్తిరించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉత్త‌రప్ర‌దేశ్ ల‌ఖీంపూర్ ఖేరీ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 13 యేళ్ళ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు కామాంధులు బలవంతంగా చెరకు తోటలోకి లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమె నాలుక క‌త్తిరించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి, ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. 
 
అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. త‌మ కూతురు ఇంటి వద్ద క‌న‌బ‌డ‌క‌పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతికారు. చెరుకు తోటల్లో ఆమె మృతదేహం ఉందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. దండగులు ఆమె క‌ళ్ల‌ను పీకేసినట్లు ఆ బాలిక తండ్రి అంటున్నాడు. 
 
అయితే, ఆ బాలిక క‌ళ్ల‌ను పొడిచినట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డి కాలేద‌ని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై బీఎస్పీ అధినేత్రి మాయావ‌తితో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తూ నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments