లాక్డౌన్ అన్లాక్ 4.0లో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారమే నడుచుకోవాలని స్పష్టంచేసింది.
మార్గదర్శకాల్లో ప్రధానంగా విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లే వెసులుబాటు కల్పించింది. లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వినే ఆప్షన్ ఇచ్చింది. ఈ మేరకు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక లేఖను విద్యార్థులు సమర్పించాలని పేర్కొన్నది.
కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే...
* కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న స్కూళ్లనే తెరువాలి.
* కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్థులు,టీచర్లు, ఉద్యోగులు బడికి రావద్దు.
* తరగతి గదితోపాటు అందరూ వినియోగించే అన్ని ప్రాంతాలను విధిగా శానిటైజ్ చేయించాలి.
* ఒకవేళ స్కూల్ను క్వారంటైన్ సెంటర్గా వాడితే పరిసరాలన్నింటినీ వందశాతం శానిటైజ్ చేయాలి.