Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ లాక్ 1.O పరిస్థితి ఏంటి..? జూన్ 8 నుంచి జాగ్రత్త.. లేకుంటే..?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (12:12 IST)
కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల మధ్య కరోనాను కట్టడి చేయడంలో సఫలమైనా.. ప్రస్తుతం అన్ లాక్ 1.Oలో పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ.. ఆందోళన మొదలైంది. ఆంక్షలు సడలించినప్పటి నుంచి కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. దేశంలో రోజుకు కేసుల సంఖ్య 8వేలు దాటిపోయింది. మొత్తం పాజిటీవ్ కేసులు లక్షా 90వేలు దాటాయి.  
 
అంతేగాకుండా మున్ముందు కరోనా కేసులు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దేశంలో కరోనా వ్యాప్తి రేటు గణనీయంగా పెరిగింది. ప్రజా రవాణాను అనుమతించడం, షాపులు తెరవడం, ప్రజల కదలికలపై ఆంక్షలు ఎత్తేయడం వల్లే భారత్‌లో కరోనా సామాజిక వ్యాప్తి దశకు వస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
 
అయితే పెరుగుతున్న కేసుల దృష్ట్యా వీటిపై పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. గతంలో కూడా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు అనుమతులిచ్చినట్టే ఇచ్చి.. వెనువెంటనే కరోనా భయంతో వాటిని నిలిపివేసింది కేంద్రం. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసి, ఇప్పుడు చేతులెత్తేసిందని ఈపాటికే కేంద్రం అప్రతిష్ట మూటగట్టుకుంటోంది. 
 
ఈ నేపథ్యంలో మరో సాహసానికి కేంద్రం పూనుకుంటుందా.. అన్ లాక్ నిబంధనలతో కేసులు తగ్గుతాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. దీంతో జూన్ 8వ తేదీ నుంచి ప్రజలు అప్రమత్తంగా వుండాలని.. మాస్కులు, సామాజిక దూరం పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేకుంటే కరోనా కేసులు పెరగక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments