కేంద్ర మంత్రి నఖ్వీ రాజీనామా.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా?

Webdunia
బుధవారం, 6 జులై 2022 (17:53 IST)
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన మంత్రిపదవికి బుధవారం రాజీనామా చేశారు. ఈయన ప్రస్తుతం బీజేపీలో కీలకమైన మైనార్టీ నేత. పైగా, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. వీరిద్దరి రాజ్యసభ పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే వారు మంత్రి పదవులు రాజీనామా చేశారు.
 
అయితే, నఖ్వీ రాజీనామాపై అనేక ఊహాగానాలను వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీయే అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నట్లు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం నఖ్వీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
 
ఇటీవల భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో మైనార్టీ వర్గంలో కాషాయ పార్టీపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో నఖ్వీని ఉపరాష్ట్రపతి పదవికి బరిలో దించాలని ఎన్డీయేలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
 
అయితే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి రేసులో పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా నఖ్వీ పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూను ఎన్డీయే ఖరారు చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments