Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై: శానిటైజ్ చేస్తానంటూ ఏటీఎంలో రూ.8లక్షల చోరీ..

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (18:18 IST)
కరోనా వైరస్ కారణంగా చోరీలు పెరిగిపోతున్నాయి. ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ వచ్చిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి ఎనిమిది లక్షల రూపాయలను దొంగలించాడు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎమ్ఎమ్‌డీఏ రోడ్డులోని ఓ ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ ఓ వ్యక్తి వచ్చాడు. 
 
ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏటీఎంను శానిటైజ్ చేయాలని చెప్పాడు. అతడి వీపుకు ఉన్న డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రాన్ని చూసిన ఏటీఎం సెక్యురిటీ గార్డు నిందితుడి చెప్పినదంతా నమ్మి ఏటీఎం లోపలికి అనుమతించి తాను బయట నిలబడ్డాడు.
 
లోపలికి వెళ్లిన నిందితుడు దొంగతనం మొదలెట్టాడు. ఇంతలో మరో వినియోగదారుడు ఏటీఎంలోని వెళ్లాడు. దొంగ డబ్బు కట్టలను సర్దుతుండగా అతడిని బ్యాంకు అధికారి అని పొరబడి బయటకి వచ్చేశాడు. దీంతో దొంగ రూ. 8.2 లక్షలతో బయటికి వచ్చి అప్పటికే అక్కడ ఏర్పాటు చేసుకున్న ఓ ఆటో ఎక్కి పారిపోయాడు. అక్కడే వేచి చూస్తున్న కస్టమర్‌కు అనుమానం రావడంతో అతడు సెక్యురిటీ గార్డుకు చెప్పాడు.
 
ఇద్దరూ కలిసి నిందుతుడి వెంట పడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే చోరి జరిగిన తీరు బట్టి అతడికి బ్యాంకు అధికారుల సహాయం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments