Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీగా బెడ్‌పై పడుకుంటే.. ఒకటే దుర్వాసన.. తర్వాత షాక్.. ఎందుకు?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (12:12 IST)
రోజంతా బయటి పని ముగించుకుని.. ఇంటకొచ్చి బెడ్ మీద హాయిగా నిద్రపోవాలనుకున్నాడు. ఇలా ప్రతిరోజూ హాయిగా బెడ్‌పై నిద్రపోతున్న వ్యక్తికి ఓ రోజు బెడ్ నుంచి భరించలేనంత దుర్వాసన వచ్చింది. దీంతో ఎలుకేదైనా చచ్చిందా అనుకుని బెడ్డెత్తి చూసిన ఆ వ్యక్తి షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బీహార్‌లోని గయకి చెందిన దినేష్ కుమార్ అనే టీ వ్యాపారి వద్ద రాజేష్ కుమార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 
 
రాజేశ్ తన భార్య బబితతో కలిసి యజమానికి చెందిన ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాడు. కాగా, ఇటీవల ఏదో పని మీద దినేశ్ దగ్గర్లోని ఓ పట్టణానికి వెళుతూ ఇంటి తాళాలు రాజేశ్‌కు ఇచ్చాడు. వారం తర్వాత ఇంటికి వచ్చిన దినేశ్ ఎప్పటిలాగానే తన బెడ్‌పై పడుకున్నాడు. ఈ రోజు ఏదో వాసనగా అనిపించినప్పటికీ అలాగే పడుకున్నాడు. దుర్వాసన మరీ ఎక్కువ రావడంతో దినేశ్ తన బెడ్‌ను ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు. 
 
బెడ్ కింద కుళ్లిన స్థితిన మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని తన డ్రైవర్ రాజేశ్ భార్య బబితగా గుర్తించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను భర్త రాజేశే చంపి ఉంటాడని భావిస్తున్నారు. మృతురాలి తండ్రి కూడా తమ కుమార్తెను రాజేషే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఇంకా పరారీలో వున్న రాజేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments