Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు హత్య కేసులో మరణ శిక్షలను రద్దు : మద్రాస్ హైకోర్టు తీర్పు

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (20:33 IST)
తమిళనాట సంచలనం సృష్టించిన ఓ పరువు హత్య కేసులో ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షలను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యువతి తండ్రి చిన్నస్వామికి ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయనను ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు, శంకర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురికి ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేసి.. వారి శిక్షను 25 సంవత్సరాల జీవిత ఖైదుకు మార్చుతూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
 
కాగా, రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లా ఉడుమలైపేటకు చెందిన దళిత యువకుడు శంకర్ అదే ప్రాంతానికి చెందిన ఓ అగ్ర కులానికి చెందిన కౌసల్యను ప్రేమించాడు. వీరి పెళ్ళికి యువతి కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో కౌసల్యను శంకర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, వీరిద్దరు మార్చి 2016లో రోడ్డుపై వెళుతుండగా పట్టపగలే బైక్‌పై వెళుతున్న కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోగా, కౌసల్య స్వల్ప గాయాలతో బయటపడింది. 
 
ఈ దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. శంకర్‌పై దాడి చేయించింది కౌసల్య తండ్రి చిన్నస్వామినేనని ఆరోపణలు రావడంతో అతనిని, అతనితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ కేసులో ట్రయల్ కోర్టు 2017లో వీరందరికీ మరణ శిక్షను విధించగా.. మద్రాస్ హైకోర్టు తాజాగా మరణ శిక్షను రద్దు చేస్తూ తీర్పును సోమవారం వెల్లడించింది. 
 
ఈ తీర్పుపై కౌసల్య స్పందిస్తూ, తనకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ తీర్పు అన్యాయమని, శంకర్ నెత్తుటి మరకల సాక్షిగా ఇది న్యాయం కాదని ఆమె చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments