సుధీక్షా భాటి కేసులో కీలక మలుపు.. ఇన్సూరెన్స్ డబ్బు కోసం చంపేశారు..

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (09:48 IST)
యూపీలోని గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌కు చెందిన సుధీక్షా భాటి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈవ్‌టీజింగ్‌ కారణంగా ఆమె మరణించినట్టు అందరూ భావిస్తున్నారు. ఇంకా యువతి ప్రయాణించిన మోటరు సైకిల్‌ను ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు వాళ్ల మామయ్య నడుపలేదని, ఇటీవలే హైస్కూల్‌ విద్యను పూర్తిచేసిన మైనర్‌ బాలుడు నడిపాడని పోలీసులు తెలిపారు. 
 
అమెరికాలో స్కాలర్‌షిప్‌తో చదువుతున్న భాటి మరణించడం వల్ల పెద్దమొత్తంలో ఇన్సూరెన్స్‌ డబ్బు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ డబ్బు రావడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే వాహనాన్ని మైనర్‌ బాలుడు నడుపలేదని కుటుంబసభ్యులు నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపించారు. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే దీన్ని ధ్రువీకరించినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఈవ్‌ టీజింగ్‌ కూడా జరిగినట్టు ఏమీ ఆధారాలు కనిపించలేదన్నారు. మరోవైపు, 15 మోటరు వాహనాలను బుధవారం స్టేషన్‌కి తీసుకొచ్చి వాటి యజమానులను ప్రశ్నిస్తున్నట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుక్‌ మై షోపై విరుచుకుపడిన నిర్మాత బన్నీ వాసు

NTR: ఎన్.టి.ఆర్. సామ్రాజ్యం సరిహద్దులు దాటింది..

Sidhu Jonnalagadda : తెలుసు కదా.. చేయడం చాలా బాధగా ఉంది, ఇకపై గుడ్ బై : సిద్ధు జొన్నలగడ్డ

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments