Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరాల అడ్డాగా మారిన యూపీ.. నిస్సిగ్గుగా ఫోనులో వీడియో తీసి..?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (13:24 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహోబ జిల్లాలో నలుగురు పాలిటెక్నిక్‌ విద్యార్ధులు యువతి (20)పై సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఉదంతం వెలుగుచూసింది. 
 
నిందితులు నిస్సిగ్గుగా తమ అకృత్యాన్ని మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. 19 నుంచి 21 సంవత్సరాలలోపు వయసున్న నలుగురు నిందితులను గౌరవ్‌, వికాస్‌, పుష్పరాజ్‌, సౌరభ్‌గా పోలీసులు గుర్తించారు. మార్చి 21 అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
 
బాధిత యువతిని నిందితులు బలవంతంగా తమ రూమ్‌కు తీసుకువచ్చి దారుణానికి ఒడిగట్టారు. నిందితులు మంగళవారం రాత్రి తమ ఇంట్లోకి చొరబడినప్పుడు తాను ఒంటరిగా ఉన్నానని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. లైంగిక దాడి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను వైరల్‌ చేస్తామని నిందితులు యువతిని హెచ్చరించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం