Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి శరణమంటూ పరుగులు పెట్టిన తృప్తి దేశాయ్.. చుక్కలు చూపించారుగా..

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (22:52 IST)
అయ్యప్పస్వామిని మహిళలు  ఎందుకు దర్సించుకోకూడదంటూ ముందు నుంచి పోరాటం చేస్తోంది భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్. ఆమె గతంలో కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుండగానే అయ్యప్పస్వామి ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే చివరకు ఉపయోగం లేకుండా పోయింది.
 
కానీ గత మూడురోజుల నుంచి శబరిమలైలోనే ఉన్న తృప్తి దేశాయ్ ఎలాగైనా స్వామివారిని దర్సించుకునే వెళతానని భీష్మించుకు కూర్చుంది. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే హిందూ సంఘాలు మాత్రం ఆమెను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నాయి. 
 
మొన్నటికి మొన్న కారంపొడి నీళ్ళతో ఆమెపై స్ప్రే చేసి భయాందోళకు గురిచేసిన హిందూ సంఘాలు ఆమె ఎక్కడ కనబడితే అక్కడ అడ్డుపడుతూనే ఉన్నాయి. దీంతో తృప్తి దేశాయ్ ఈరోజు మధ్యాహ్నం నేరుగా కమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్ళారు. తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. అయితే పోలీసులు అది సాధ్యం కాదని తేల్చేశారు. 
 
తృప్తి కమిషనర్ కార్యాలయం వద్ద ఉందని తెలుసుకున్న హిందూ ధార్మిక సంఘాలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో తృప్తి దేశాయ్ వెనక్కి తగ్గింది. పుణేకు బయలుదేరి వెళ్ళిపోయింది. దీంతో హిందూ ధార్మిక సంఘాల నేతలు కూడా శాంతించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments