Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి శరణమంటూ పరుగులు పెట్టిన తృప్తి దేశాయ్.. చుక్కలు చూపించారుగా..

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (22:52 IST)
అయ్యప్పస్వామిని మహిళలు  ఎందుకు దర్సించుకోకూడదంటూ ముందు నుంచి పోరాటం చేస్తోంది భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్. ఆమె గతంలో కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుండగానే అయ్యప్పస్వామి ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే చివరకు ఉపయోగం లేకుండా పోయింది.
 
కానీ గత మూడురోజుల నుంచి శబరిమలైలోనే ఉన్న తృప్తి దేశాయ్ ఎలాగైనా స్వామివారిని దర్సించుకునే వెళతానని భీష్మించుకు కూర్చుంది. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే హిందూ సంఘాలు మాత్రం ఆమెను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నాయి. 
 
మొన్నటికి మొన్న కారంపొడి నీళ్ళతో ఆమెపై స్ప్రే చేసి భయాందోళకు గురిచేసిన హిందూ సంఘాలు ఆమె ఎక్కడ కనబడితే అక్కడ అడ్డుపడుతూనే ఉన్నాయి. దీంతో తృప్తి దేశాయ్ ఈరోజు మధ్యాహ్నం నేరుగా కమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్ళారు. తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. అయితే పోలీసులు అది సాధ్యం కాదని తేల్చేశారు. 
 
తృప్తి కమిషనర్ కార్యాలయం వద్ద ఉందని తెలుసుకున్న హిందూ ధార్మిక సంఘాలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో తృప్తి దేశాయ్ వెనక్కి తగ్గింది. పుణేకు బయలుదేరి వెళ్ళిపోయింది. దీంతో హిందూ ధార్మిక సంఘాల నేతలు కూడా శాంతించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమకంటే పెద్దవారైన ఆంటీలతో అబ్బాయిలు శృంగారం.. అనసూయ షాకింగ్ కామెంట్స్

నేను కొంచెం ఒత్తిడికి గురైనా, ఆమె దానిని గమనిస్తుంది.. నాగ చైతన్య

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments