Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్సవాలు.. అలిసిపోయారు.. రైల్వే ట్రాక్‌పై నిద్రపోయారు.. అంతే..?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (13:59 IST)
తమిళనాడు తిరువారూర్‌లో రైలు పట్టాలపై నిద్రిస్తున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొని మృతి చెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లాలోని ముత్తుపేటైలో ఓ అమ్మవారి ఆలయం ఉంది. ప్రస్తుతం ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండటంతో ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
 
ఈ ఉత్సవాలకు హాజరైన ముగ్గురు యువకులు రాత్రి అలసట కారణంగా రైల్వే ట్రాక్‌పై నిద్రించారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3:30 గంటలకు తాంబరం నుంచి సెంగోట్లైకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ట్రాక్‌పై నిద్రిస్తున్న యువకులపైకి దూసుకెళ్లడంతో ఆ ముగ్గురు మృతి చెందారు.
 
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రైలు ఢీకొన్న ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పండుగకు వచ్చిన ముగ్గురు యువకులు పట్టాలపై పడుకుని రైలు ఢీకొని మృతి చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments