Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు ప్రత్యక్ష వారసులు లేరు... అమృతకు వేదనిలయం ఇచ్చేది లేదు

తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని సర్కారు తేల్చి చెప్పింది. జయలలిత నివాసమైన వేద నిలయం స్మారక మం

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (12:19 IST)
తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని సర్కారు తేల్చి చెప్పింది. జయలలిత నివాసమైన వేద నిలయం స్మారక మందిరమేనని తమిళ సర్కారు వెల్లడించింది. వేద నిలయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు చెన్నై జిల్లా కలెక్టర్ అన్బుసెల్వన్ తెలిపారు. 
 
అయితే జయలలితకు తాను పుట్టిన బిడ్డనని బెంగళూరుకు చెందిన అమృత తెరపైకి వచ్చిన నేపథ్యంలో.. జయకు వారసులు లేరని ప్రకటించడంపై అన్బుసెల్వన్ మాట్లాడుతూ.. ఒకవేళ భవిష్యత్తులో ఆధారాలతో అమృత వస్తే.. అప్పటికి వేదనిలయానికి వెల కట్టడం జరుగుతుందే కానీ.. వేదనిలయాన్ని అప్పగించే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేశారు. అంతేగాకుండా అమ్మకు వారసులు ఎవరూ లేరని, ఒకవేళ ఉండివుంటే, ఆమె బహిరంగంగా ఎన్నడో ప్రకటించేవారని చెప్పారు. వేదనిలయంలో రహస్యంగా గదులు ఉన్నాయా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
 
కాగా, ఇప్పటికే అన్బు సెల్వన్ నేతృత్వంలోని 20 మంది అధికారులు వేదనిలయం స్థలం కొలతలు, ఆస్తి విలువ, తదితరాలను గణించారన్న సంగతి తెలిసిందే. అందులోని రెండు గదులను ఐటీ అధికారులు సీజ్ చేయడంతో, అందులో ఏముందోనన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments