Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు ప్రత్యక్ష వారసులు లేరు... అమృతకు వేదనిలయం ఇచ్చేది లేదు

తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని సర్కారు తేల్చి చెప్పింది. జయలలిత నివాసమైన వేద నిలయం స్మారక మం

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (12:19 IST)
తమిళనాడు సర్కారు అమ్మ వారసత్వంపై తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని సర్కారు తేల్చి చెప్పింది. జయలలిత నివాసమైన వేద నిలయం స్మారక మందిరమేనని తమిళ సర్కారు వెల్లడించింది. వేద నిలయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు చెన్నై జిల్లా కలెక్టర్ అన్బుసెల్వన్ తెలిపారు. 
 
అయితే జయలలితకు తాను పుట్టిన బిడ్డనని బెంగళూరుకు చెందిన అమృత తెరపైకి వచ్చిన నేపథ్యంలో.. జయకు వారసులు లేరని ప్రకటించడంపై అన్బుసెల్వన్ మాట్లాడుతూ.. ఒకవేళ భవిష్యత్తులో ఆధారాలతో అమృత వస్తే.. అప్పటికి వేదనిలయానికి వెల కట్టడం జరుగుతుందే కానీ.. వేదనిలయాన్ని అప్పగించే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేశారు. అంతేగాకుండా అమ్మకు వారసులు ఎవరూ లేరని, ఒకవేళ ఉండివుంటే, ఆమె బహిరంగంగా ఎన్నడో ప్రకటించేవారని చెప్పారు. వేదనిలయంలో రహస్యంగా గదులు ఉన్నాయా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
 
కాగా, ఇప్పటికే అన్బు సెల్వన్ నేతృత్వంలోని 20 మంది అధికారులు వేదనిలయం స్థలం కొలతలు, ఆస్తి విలువ, తదితరాలను గణించారన్న సంగతి తెలిసిందే. అందులోని రెండు గదులను ఐటీ అధికారులు సీజ్ చేయడంతో, అందులో ఏముందోనన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments