Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగి వున్న ఆంబులెన్స్‌లోకి ముగ్గురు యువకులు.. చివరికి ఏమైందంటే?

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (13:16 IST)
corona
కరోనా వైరస్ వ్యాపించడంతో ప్రజలంతా లాక్ డౌన్‌లో వున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా.. ఆ ఆంక్షలను కొందరు పాటించట్లేదు. ఇందులో ముఖ్యంగా యువత లాక్ డౌన్‌ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు.

మాస్కులు ధరించకుండానే రోడ్లపైకి రావడం చేస్తున్నారు. అంతేగాకుండా ముగ్గురు ఒకే బైకుపై తిరగడం వంటివి చేస్తున్నారు. అలాంటి వారికి తమిళనాడు, తిరుప్పూరు పోలీసులు చుక్కలు చూపించారు. కరోనా అంటే ఎలా వుంటుందో చుక్కలు కనిపించేలా సినిమా చూపించేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్‌తో యువకులు పనీపాటా లేకుండా వాహనాలతో రోడ్ల మీదకు వస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు కఠినంగానే శిక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు పోలీసులు లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన ఆకతాయిలకు కరోనా సినిమా చూపించారు.
 
బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను ఆపి.. కరోనా పేషెంట్‌ ఉన్న అంబులెన్స్‌లోకి ఎక్కించి బుద్ధి చెప్పారు. రోడ్ల మీదకు వచ్చిన వారిని కరోనా రోగి ఉన్న అంబులెన్స్‌, లేదా గదిలో బంధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అలా కరోనా రోగి వున్నట్లు ఆంబులెన్స్‌లో ఓ వ్యక్తిని వుంచి.. లాక్ డౌన్‌ను అధిగమించిన ఆ ముగ్గురు యువకులను ఆ ఆంబులెన్స్‌లోని పంపారు. 
 
ఆ ముగ్గురు యువకులు నిజమైన కరోనా రోగిగా అతని నుంచి తప్పించుకునేందుకు మల్లగుల్లాలు పడ్డారు. కిటికీల నుంచి దూకారు. అయినా ఆ యువకులను వారు ఏమాత్రం వదిలిపెట్టక ఆంబులెన్స్‌లోకి ఎత్తిపడేశారు వాలంటీర్లు. తర్వాత బుద్ధి తెలుసుకున్న యువకులు.. మాస్క్‌ ధరించి బతుకు జీవుడా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments