Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లికి నో చెప్పిన తల్లిదండ్రులు.. సూసైడ్ చేసుకున్న మహిళా పోలీసు

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (09:21 IST)
తాను ప్రేమించిన యువకుడితో పెళ్లికి నిరాకరించడంతో ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తిరుచ్చిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుచ్చి ఎడమలై పట్టి పుదూరు క్రాపట్టి పోలీసు క్వార్టర్స్‌లో రాజ్యలక్ష్మి (24) నివాసం ఉంటుంది. ఈమె జిల్లా సాయుధ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. 
 
ఈమె పెట్టవాయ్‌తలైకు చెందిన హోమ్‌గార్డ్‌ శివకుమార్‌ను గత కొంత కాలంగా రాజ్యలక్ష్మి ప్రేమిస్తోంది. అయితే వీరి వివాహానికి ఇరు వైపుల పెద్దలు ఒప్పుకోలేదు. ఇదే విషయమై శనివారం రాత్రి శివకుమార్, రాజ్యలక్ష్మి సెల్‌ఫోన్‌లో చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రాజ్యలక్ష్మి ఆగ్రహంతో కాల్‌ కట్‌ చేసింది.
 
ఆదివారం ఉదయం శివకుమార్‌ రాజ్యలక్ష్మికి ఫోన్‌ చేయగా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన శివకుమార్‌ హూటాహుటిన క్రాపట్టి పోలీసు క్వార్టర్స్‌ చేరుకుని రాజ్యలక్ష్మి గదికెళ్ళి చూశాడు. అప్పటికే రాజ్యలక్ష్మి విషం తాగి అచేతనంగా పడివుండటాన్ని గుర్తించిన శివకుమార్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments