Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లికి నో చెప్పిన తల్లిదండ్రులు.. సూసైడ్ చేసుకున్న మహిళా పోలీసు

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (09:21 IST)
తాను ప్రేమించిన యువకుడితో పెళ్లికి నిరాకరించడంతో ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తిరుచ్చిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుచ్చి ఎడమలై పట్టి పుదూరు క్రాపట్టి పోలీసు క్వార్టర్స్‌లో రాజ్యలక్ష్మి (24) నివాసం ఉంటుంది. ఈమె జిల్లా సాయుధ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. 
 
ఈమె పెట్టవాయ్‌తలైకు చెందిన హోమ్‌గార్డ్‌ శివకుమార్‌ను గత కొంత కాలంగా రాజ్యలక్ష్మి ప్రేమిస్తోంది. అయితే వీరి వివాహానికి ఇరు వైపుల పెద్దలు ఒప్పుకోలేదు. ఇదే విషయమై శనివారం రాత్రి శివకుమార్, రాజ్యలక్ష్మి సెల్‌ఫోన్‌లో చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రాజ్యలక్ష్మి ఆగ్రహంతో కాల్‌ కట్‌ చేసింది.
 
ఆదివారం ఉదయం శివకుమార్‌ రాజ్యలక్ష్మికి ఫోన్‌ చేయగా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన శివకుమార్‌ హూటాహుటిన క్రాపట్టి పోలీసు క్వార్టర్స్‌ చేరుకుని రాజ్యలక్ష్మి గదికెళ్ళి చూశాడు. అప్పటికే రాజ్యలక్ష్మి విషం తాగి అచేతనంగా పడివుండటాన్ని గుర్తించిన శివకుమార్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments